
వరంగల్, వెలుగు: ప్రముఖ కవయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత(67) డెడ్బాడీని వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు. సోమవారం గుండెపోటుతో ఆమె చనిపోగా, ఆమె మృతదేహాన్ని చివరి చూపు కోసం ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే నివాసం వద్ద ఉంచారు. మంగళవారం ఉదయం ర్యాలీగా వరంగల్ కేఎంసీకి తరలించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కవులు, రచయితలు, సాహితివేత్తలు, పౌరహక్కుల సంఘం నేతలు, కేయూ స్టూడెంట్లు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె డెడ్బాడీని కేఎంసీకి అందజేశారు.