
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యవహారంపై రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఢిల్లీలోని శాస్త్రిపార్క్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల గేట్కు సిసోడియా బ్యానర్ ఏర్పాటైంది. దీనిపై అక్కడి స్థానికులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ ఆస్తుల దుర్వినియోగ నిరోధక చట్టం సెక్షన్ 3 కింద శాస్త్రిపార్క్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) కో-ఆర్టినేటర్ గజాలాతో పాటు ప్రిన్సిపాల్.. స్కూల్ గేట్కు సిసోడియా బ్యానర్ను ఏర్పాటు చేసేందుకు సహకరించారని తెలుస్తోంది.
అయితే ఈ పోస్టర్ ను మ్ఆద్మీ పార్టీ కార్యకర్తలు కొందరు శాస్త్రిగేట్ ప్రభుత్వ పాఠశాల గేట్కు తగిలించారని ఫిర్యాదు చేసిన దివాకర్ పాండే ఆరోపించారు. అయితే ఈ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే అనుమతి ఉందని కూడా ఆప్ కార్యకర్తలు చెప్పినట్టు ఆయన తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం పాఠశాలను వినియోగించుకునేందుకు ఇలాంటి అనుమతులు ఏవీ ఉండవని తమకు తెలుసునని దివాకర్ పాండే వెల్లడించారు.