పోలీస్ కానిస్టేబుల్‌కు స్వైన్‌ఫ్లూ

పోలీస్ కానిస్టేబుల్‌కు స్వైన్‌ఫ్లూ

హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా తుమ్మినా, దగ్గినా భయపడిపోతున్నారు. లేటెస్ట్ గా స్వైన్ ఫ్లూ కూడా నగరంలో కలకలం రేపుతోంది. ఓ కానిస్టేబుల్‌కు స్వైన్ ఫ్లూ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పేట్లబుర్జ్‌లో 9 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్‌లకు తరలించి పరీక్షలు నిర్వహించగా..ఒకరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. మిగిలిన 8 మందిని డిశ్చార్జి చేసి, స్వైన్‌ఫ్లూ సోకిన ఆ కానిస్టేబుల్ ను ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని చెస్ట్  ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.