అనారోగ్యంతో పోలీసు కుక్క మృతి

అనారోగ్యంతో పోలీసు కుక్క మృతి

నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా పోలీసు శాఖకు చెందిన ఓ జాగిలం అనారోగ్యంతో మృతి చెందగా పోలీసులు నివాళి అర్పించారు. 2018 నుంచి జూలీ అనే జాగిలం పలు క్రిమినల్​కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించింది. జూలీ అనారోగ్యంతో మృతిచెందగా.. జిల్లా పోలీసు ఆఫీసులో దాని కళేబరంపై ఎస్పీ ప్రవీణ్ కుమార్ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఎస్పీతో పాటు పోలీస్ సిబ్బంది సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. లాబ్రడార్ ​జాతికి చెందిన ఈ జాగిలం వీఐపీ, వీవీఐపీ బందోబస్తు విధులు నిర్వహిస్తూ, పలు హత్య, దొంగతనం కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబర్చిందన్నారు. జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లలోనూ పాల్గొని ప్రతిభ చూపిందన్నారు. అనంతరం పోలీసు లాంఛనాలతో జాగిలానికి అంత్యక్రియలు నిర్వహించారు.