ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం..

ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం..

హైదరాబాద్: భార్యను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మలక్ పేట్లో చోటు చేసుకుంది. మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిందే విజయ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోగా తీవ్రగాయాలైన విజయ్ ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా తన భార్యను ఫారూక్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. ఇదే విషయమై బాధితుడు విజయ్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫారూక్ పై ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. విజయ్ శరీర భాగాలు 70 శాతం కాలిపోయాయి. 

అయితే పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే విజయ్ ఆత్మహత్యాయత్నం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విజయ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని తెలిపారు. నిందితుడు ఫారూక్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.