టీజీపల్లెలో రేషన్ బియ్యం పట్టివేత

టీజీపల్లెలో రేషన్ బియ్యం పట్టివేత

జన్నారం, వెలుగు: జన్నారం మండలంలోని టీజీపల్లె సమీపంలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఉట్నూర్ వైపు వెళ్తున్న బొలేరో వాహనంలో బియ్యాన్ని తరలిస్తుండగా సీజ్​ చేసినట్లు ఎస్ఐ రాజవర్ధన్​తెలిపారు. 

డ్రైవర్ తప్పించుకుని పారిపోగా, వాహనాన్ని స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు.