బీఆర్ఎస్​ప్రభుత్వం యువతను నట్టేట ముంచింది: పొంగులేటి

బీఆర్ఎస్​ప్రభుత్వం యువతను నట్టేట ముంచింది: పొంగులేటి

ఖమ్మం: బీఆర్ఎస్​ప్రభుత్వం యువతను నట్టేట ముంచిందని, సర్కార్ అసమర్థత వల్లే రెండు సార్లు గ్రూప్​పరీక్షలు రద్దు చేశారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పాలేరు టికెట్​ఆశించిన కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ‘కురుక్షేత్రం రాబోతుంది.

యుద్ధ సమయం వచ్చింది. కాంగ్రెస్​అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేపటి నుంచి రాహుల్, ప్రియాకం గాంధీ ఎన్నికల శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర​ప్రభుత్వం యువతను నట్టేట ముంచింది. సర్కార్ అసమర్థత వల్లే రెండు సార్లు గ్రూప్​పరీక్షలు రద్దు చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చిత్తశుద్ధి లేదు’ అని అన్నారు.