దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఉదయం దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రహ్లాద్ జోషి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆ తర్వాత మలక్ పేట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని మాజీ ఎంపీ నల్లు ఇంద్రసేనా రెడ్డితో కలిసి ప్రారంభించారు. అక్కడి దిల్ సుఖ్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో నిర్వహిస్తున్న హైదరాబాద్ లోక్ సభ కోర్ కమిటీ సమావేశానికి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. 

ఉదయం 11.30గంటలకు ప్రహ్లాద్ జోషి  ఐఎస్ సదన్ లోని వినయ్ నగర్ కమ్యూనిటీ హాల్ లో దివ్యాంగులతో సమావేశమై వారికి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం 4.30కు కరోనాతో మృతి చెందిన ఆర్ఎస్ఎస్ సభ్యులు శ్రీహరి రాఘవేంద్రరావు, చంద్రశేఖర్ యాదవ్ కుటుంబ సభ్యుల  పరామర్శిస్తారు. అనంతరం నాంపల్లి స్టేషన్ ను సందర్శించి 7గంటలకు గన్ ఫౌండ్రీలో జరగనున్న సమావేశంలో పాల్గొంటారు.