మోడీ సోదరుడికి తప్పిన ప్రమాదం

మోడీ సోదరుడికి తప్పిన ప్రమాదం

ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో మంగళవారం కర్ణాటకలోని మైసూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మైసూరు శివార్లలో కడ్కోళ్ల అనే ప్రాంతానికి చేరుకున్న అనంతరం కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీకి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.