వెంటిలేటర్ పై ప్రణబ్ ముఖర్జీ

వెంటిలేటర్ పై ప్రణబ్ ముఖర్జీ

న్యూఢిల్లీ: మాజీ ప్రెసిడెం ట్‌ ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన ఆర్మీ రీసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ రిఫరల్‌ హాస్పిటల్‌ లో సోమవారం అడ్మిట్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై ట్రీట్​మెంట్​ ఇస్తున్నారు. అంతకుముందు ఆయనకు డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ ని సక్సెస్ ఫుల్​గా పూర్తి చేశారు. వారం రోజులుగా తనను కలిసిన వారందరూ సెల్ఫ్‌ ఐసోలేషన్‌‌‌‌లో ఉండాలని, కరోనా టెస్ట్‌‌‌‌ చేయించుకోవాలని ప్రణబ్‌ సూచించారు. కాంగ్రెస్‌‌‌‌ చీఫ్ స్పోక్స్‌‌‌‌ పర్సన్‌‌‌‌ రణ్‌దీస్‌‌‌‌ సుర్జేవాలా, నేతలు అభిషేక్‌‌‌‌ సింఘ్వీ, రాజస్థాన్‌‌‌‌ సీఎం అశోక్‌‌‌‌ గెహ్లాట్ , యూనియన్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ పియూశ్‌ గోయల్‌ ప్రణబ్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్​ చేశారు.