నితీశ్‌‌కుమార్‌‌‌‌కు ప్రశాంత్‌‌ కిశోర్ సవాల్‌‌

నితీశ్‌‌కుమార్‌‌‌‌కు ప్రశాంత్‌‌ కిశోర్ సవాల్‌‌

పాట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌‌ కిశోర్, బీహార్‌‌‌‌ సీఎం నితీశ్‌‌కుమార్‌‌‌‌ల మధ్య వివాదం ముదురుతోంది. నితీశ్​పై ప్రశాంత్​ కిశోర్​ శనివారం మరోసారి ఆరోపణలు గుప్పించారు.బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే, జేడీయూ ఎంపీ హరివంశ్​ను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌‌ పదవికి రాజీనామా చేయించాలని సవాల్‌‌ విసిరారు. ‘‘నితీశ్‌‌ జీ.. నిజంగా బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే, మీ ఎంపీని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌‌ పదవికి రాజీనామా చేయమని అడగండి” అంటూ ట్వీట్‌‌ చేశారు.