ముంబై: ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ సెమీస్ ముంగిట టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారత స్టార్ ఆల్ రౌండర్ ప్రతీకా రావల్ తీవ్రంగా గాయపడింది. ఆదివారం (అక్టోబర్ 26) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో ప్రతీకాకు ఇంజ్యూరీ అయ్యింది. బౌండరీ వెళ్తున్న బంతిని ఆపబోయే క్రమంలో కాలు మలుసుని కిందపడింది. దీంతో గ్రౌండ్లోనే నొప్పితో ప్రతీకా విలవిలలాడింది.
నొప్పితో బాధపడుతున్న ప్రతీకా సహాయక సిబ్బంది సహాయంతో మైదానం వీడింది. గాయం తీవ్రతతో ఎక్కువగా ఉండటంతో ప్రతీకా బ్యాటింగ్కు కూడా దిగలేదు. దీంతో అమన్ జోత్ కౌర్తో కలిసి ఓపెనర్ స్మృతి మందాన ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతీకా గాయం గురించి బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.
బంగ్లాదేశ్తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆల్ రౌండర్ ప్రతీకా రావల్ మోకాలికి, చీలమండలానికి గాయమైందని తెలిపింది. బీసీసీఐ వైద్య బృందం ఆమెను నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించింది. ఇండియాకు సెమీస్కు వెళ్లాలంటే కీలకమైన మ్యాచులో న్యూజిలాండ్పై భారీ సెంచరీతో చెలరేగింది ప్రతీకా. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది.
టోర్నీలో మంచి ఫామ్లో ఉన్న ప్రతీకా కీలకమైన సెమీస్ ముందు గాయపడటం టీమిండియాకు ఇబ్బందిగా మారింది. కాగా, భారత్ వేదికగా జరుగుతోన్న ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో టీమిండియా సెమీస్కు చేరిన విషయం తెలిసిందే. లీగ్ దశలో భాగంగా ఆదివారం (అక్టోబర్ 26) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో బంగ్లాదేశ్తో నామామాత్రపు మ్యాచ్ ఆడుతోంది.
A freak injury for Indian opener #PratikaRawal while diving to save a boundary! 😧
— Star Sports (@StarSportsIndia) October 26, 2025
Catch the LIVE action ➡ https://t.co/AHK0zZJTc3#CWC25 👉 #INDvBAN | LIVE NOW pic.twitter.com/xvWH7lFTrV
