చావు పిలుస్తోంది.. వెళ్తున్నా! .. బీబీనగర్ చెరువులో దూకిన బ్యాంక్ మేనేజర్!

చావు పిలుస్తోంది.. వెళ్తున్నా! .. బీబీనగర్ చెరువులో దూకిన బ్యాంక్ మేనేజర్!
  • భార్య కూడా దూకడంతో రక్షించిన పోలీసులు 
  • యాదాద్రి జిల్లాలో ఘటన

యాదాద్రి, వెలుగు:  చెరువులో దూకి బ్యాంకు మేనేజర్ గల్లంతైన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్​జిల్లా ఐనవోలుకు చెందిన బర్ల సురేందర్(36) , సంధ్యారాణి దంపతులు కొడుకు చోటుతో కలిసి హైదరాబాద్ రామాంతాపూర్​లో ఉంటున్నాడు. సురేందర్ హైటెక్​సిటీలోని ఓ ప్రైవేట్​బ్యాంక్​లో మేనేజర్. శుక్రవారం ఉదయం బ్యాంక్​కు వెళ్తున్నానని  ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. 

యాదాద్రి జిల్లా బీబీనగర్​ చెరువు వద్దకు వెళ్లి.. తన ఫోన్​లో వాయిస్​ మెసేజ్​రికార్డు చేసి భార్యకు, బంధువులకు పంపించాడు. ‘నాకు పది రోజులుగా మానసిక స్థితి బాగా లేదు. చావు రమ్మని పిలుస్తోంది. అందుకే బీబీనగర్​చెరువులో దూకి చనిపోతున్నా. నా అంత్యక్రియలు పాత ఇంటి వద్ద చేయాలి”. అంటూ వాయిస్​ మెసేజ్​లో తెలిపాడు.

 అనంతరం సురేందర్​చెప్పులు, ఫోన్ కట్టపైన లభించాయి. వెంటనే సంధ్యారాణి, బంధువులతో కలిసి బీబీనగర్ ​వెళ్లారు. అప్పటికే  పోలీసులు చెరువు వద్దకు వెళ్లగా సురేందర్ సెల్​ఫోన్, చెప్పులు కన్పించాయి. దీంతో చెరువులో ఎన్​డీఆర్​ఎఫ్​, ఫైర్​సిబ్బందితో గాలింపు చేపట్టారు. 

అక్కడికి చేరిన సంధ్యారాణి భర్త లేకుండా తాను బతకలేనని చెరువులో దూకింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను రక్షించారు. తల్లిని హత్తుకుని కొడుకు బోరున విలపించాడు.  కాగా.. చెరువు నిండా నీళ్లు ఉండగా చీకటిపడే వరకూ వెతికినా సురేందర్​ఆచూకీ దొరకలేదు. దీంతో రాత్రి గాలింపు నిలిపివేశారు. శనివారం మళ్లీ గాలింపు కొనసాగిస్తామని ఎస్ హెచ్​వో ప్రభాకర్​ రెడ్డి తెలిపారు.