కరోనా నుంచి కోలుకున్న కొందరిలోబ్రెయిన్ స్ట్రోక్ కనిపిస్తోంది. ఈ పరిస్థితి గురించి అవేర్నెస్ లేకపోవడంతో బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడేవాళ్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. స్ట్రోక్కి గురయ్యే వాళ్లలో యంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటున్నారని చెబుతున్నారు న్యూరో సర్జన్ విశ్వనాథన్ అయ్యర్. మెదడుకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు లేదా ఆ రక్తనాళాల సైజ్ తగ్గినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. పెద్దవాళ్లతో పోల్చితే చిన్న వయసులోనే స్ట్రోక్ రావడం వాళ్ల జీవితం మీద నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ మొదటి కొన్ని నెలల్లో డిప్రెషన్కు లోనవుతారు. ఆ టైంలో వాళ్లకు కౌన్సెలింగ్ చాలా అవసరం.
కారణాలివే
బీపీ, స్మోకింగ్, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలు, డ్రగ్స్ అలవాటు, ఊబకాయం కూడా బ్రెయిన్ స్ట్రోక్కు దారి తీస్తాయి. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ భవిష్యత్తులో కూడా స్ట్రోక్కు కారణమవుతాయని పలు 'స్టడీస్ చెప్తున్నాయి. యంగ్స్టర్స్లోనే కాకుండా పెద్దవాళ్లలోనూ ఈ సింప్టమ్స్ స్ట్రోక్కు దారి తీస్తున్నాయి. మెదడును, మనిషిని బలహీనం చేసే ఈ సమస్య లక్షలాదిమంది భారతీయుల్లో ఉంది. అయితే ఈ సమస్య ఉందనే విషయం వాళ్లకు అస్సలు తెలియదు. స్ట్రోక్కు గురైన వాళ్లు తిరిగి నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే, మెదడు ఎంత ఎఫెక్ట్ అయింది, కేర్టేకర్స్ ఇచ్చే సపోర్ట్, స్ట్రోక్ రావడానికి ముందు వాళ్ల ఆరోగ్యం పరిస్థితి, పేషెంట్స్ మోటివేషనల్ లెవల్స్... వంటివి వాళ్లు ఎంత త్వరగా కోలుకుంటారనే దానిపై ప్రభావం చూపిస్తాయి.
త్వరగా కోలుకునేందుకు
హెల్దీగా, హార్టీగా ఉండేందుకు పోషకాలున్నవి తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ ఉన్న డ్రింక్స్, స్మోకింగ్, ఆల్కహాల్ మానేయ్యాలి. ఉప్పు బాగా తగ్గించాలి. రోజూ ఎక్సర్సైజ్ చెయ్యాలి. దాంతో గుండె జబ్బులు రావు. అలాగే బ్రెయిన్స్ట్రోక్ రాకుండా జాగ్రత్తపడొచ్చు.