ఈనెల 28న భద్రాచలం, రామప్పకు రాష్ట్రపతి

ఈనెల 28న భద్రాచలం, రామప్పకు రాష్ట్రపతి

భద్రాచలం, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 28న భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి ఆలయం, రామప్ప గుడికి వస్తున్నారు. 28న ఉదయం సీతారామ చంద్రస్వామి దర్శనం చేసుకుంటారు. తర్వాత కేంద్ర టూరిజం శాఖ 50కోట్లతో చేపట్టే ప్రసాద్ స్కీం పనులకు భూమిపూజ చేస్తారు.  

అనంతరం ద్రౌపది ముర్ము రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత... ప్రసాద్ స్కీమ్ లో ఎంపిక చేసిన ఆయల పనులకు భూమి పూజ చేస్తారు.