
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రధాని మోడీ ఆరా తీశారు. సీఎం జగన్ కు ఫోన్ చేసిన మోడీ..భారీ వర్షాలు..అనంతర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ఈ సందర్బంగా మోడీకి వివరించారు జగన్. సహాయ కార్యక్రమాలకు నేవీ హెలికాప్టర్లు వినియోగించుకుంటున్నామని జగన్ ప్రధానికి తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందదని.. ఏ సహాయం కావాలన్నా అడగాలని సూచించారు మోడీ.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan గారి తో మాట్లాడడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాను. ఈ సమయంలో అందరూ సురక్షితంగా, భద్రంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) November 19, 2021