ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోడీ ఫోన్

ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోడీ ఫోన్

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రధాని మోడీ ఆరా తీశారు. సీఎం జగన్ కు ఫోన్ చేసిన మోడీ..భారీ వర్షాలు..అనంతర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ఈ సందర్బంగా మోడీకి వివరించారు జగన్. సహాయ కార్యక్రమాలకు  నేవీ హెలికాప్టర్లు వినియోగించుకుంటున్నామని  జగన్  ప్రధానికి తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందదని.. ఏ సహాయం కావాలన్నా అడగాలని సూచించారు మోడీ.