లోకేశ్వరం, వెలుగు: రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రిన్సిపాల్చితకబాదిన ఘటన లోకేశ్వరం మండల కేంద్రంలోని అమెరి కిడ్స్పాఠశాలలో చోటుచేసుకుంది. బాధిత చిన్నారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. హద్గాం గ్రామానికి చెందిన సుమలత, సాయన్న దంపతుల కూతురు శృతిక, మరో విద్యార్థిని శుక్రవారం స్కూల్లో గొడవ పడ్డారు. శృతిక డస్టర్విసరడంతో ఆ పాప తలకు గాయమైంది.
విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్దివ్య శృతికను ఆఫీస్రూమ్కు తీసుకెళ్లి చితకబాదింది. తమ చిన్నారి వీపుపై వాతల పడి, రాత్రి జ్వరం వచ్చిందని సాయన్న తెలిపాడు. శనివారం ఎస్సై అశోక్ కుమార్, ఎంఈవో చంద్రకాంత్, తహసీల్దార్భోజన్నకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనపై ఎంఈవోను వివరణ కోరగా.. డీఈవో దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
