పరీక్షల మాఫియాను బీజేపీ రక్షిస్తోంది : ప్రియాంక గాంధీ

పరీక్షల మాఫియాను బీజేపీ రక్షిస్తోంది : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: పరీక్షల మాఫియా, ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ సర్కారు రక్షిస్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ విమర్శించారు. ఆగ్రాలో గురువారం పేపర్ లీక్​ అయింది. దీనిపై శుక్రవారం ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. మరోసారి పేపర్ లీక్ ఎందుకయిందని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఉద్యోగాల నుంచి బోర్డ్ పరీక్షలకు సంబంధించిన ప్రతీ పేపర్ లీకవుతుందన్నారు. 

కోట్లాది మంది యువత, పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తున్న పరీక్షల మాఫియాను బీజేపీ ప్రభుత్వం కాపాడుతుందని విమర్శించారు. రాష్ట్రంలోని పిల్లలకు మంచి చదువు అంది వారి భవిష్యత్తు బాగుండటం బీజేపీకి ఇష్టం లేదా అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.