హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ చిత్రం అందరినీ భయపెడుతుందని, హార్ట్ వీక్గా ఉన్నవాళ్లు ఈ సినిమా చూడొద్దని సినిమాను విడుదల చేస్తున్న బన్నీ వాస్, వంశీ నందిపాటి అన్నారు.
త్రిగుణ్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించాడు. హెబ్బాపటేల్ హీరోయిన్. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో బన్నీ వాస్ మాట్లాడుతూ ‘నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత నేను కూడా నాలుగుసార్లు భయపడ్డా. ఎవరి డబ్బులూ వృథా చేయని సినిమా ఇది. టిక్కెట్ ధర కూడా రీజనబుల్గానే ఉంటుంది. ఇక ఈ సినిమాను హార్ట్ వీక్గా ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు’ అని చెప్పారు.
ఈ సినిమా చూశాక ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నానని వంశీ నందిపాటి అన్నారు. ఇదొక హారర్ థ్రిల్లర్ అని, ప్రతి ఒక్కరినీ భయపెడుతుందని దర్శకుడు శ్రీనివాస్ మన్నె, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ అన్నారు.
