నిజామాబాద్, వెలుగు: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసేదాకా ఈనెల 18 వరకు జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్, ఆలూర్, బాల్కొండ, భీంగల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట, వేల్పూర్, ఎర్గెట్ల మండలాల్లో నిషేదాజ్ఞలు కొనసాగుతాయన్నారు. దీని ప్రకారం ఐదుగురికంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడి ఉండరాదన్నారు. లా అండ్ ఆర్డర్ రక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, లేకుంటే యాక్షన్ తీసుకుంటామన్నారు.
