పీయూలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

పీయూలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్  కాలేజీలను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు శనివారం నల్ల బడ్జీలతో నిరసన తెలిపారు. ఈ నెల 24 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఆందోళనలో విద్యార్థులు పాల్గొని లా, ఇంజనీరింగ్  కాలేజీల సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ, ఎస్ఎస్ యూ, పీయూ జేఏసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.