లాస్ ఏంజెల్స్లో కర్ఫ్యూ.. బలగాలు, నిరసనకారులతో రణరంగంగా మారిన వీధులు

లాస్ ఏంజెల్స్లో కర్ఫ్యూ.. బలగాలు, నిరసనకారులతో రణరంగంగా మారిన వీధులు
  • అక్రమ వలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా ఐదోరోజూ ఆందోళనలు
  • బలగాలు, నిరసనకారులతో రణరంగంగా మారిన వీధులు
  • నిరసనల మాటున ఆపిల్​ స్టోర్, ఇతర షాపులు లూటీ
  • 96 మంది అరెస్ట్​.. ఇతర నగరాలకూ పాకిన నిరసనలు
  • ఆందోళనలు చేస్తున్నవారు విదేశీ శత్రువులు: ట్రంప్​

లాస్​ఏంజెల్స్: అక్రమ వలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా అమెరికాలోని లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజెల్స్​లో  నెలకొన్న ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. శుక్రవారం ఓ యూనియన్​ నేత అరెస్ట్​తో మొదలైన నిరసనలు.. మంగళవారం ఐదోరోజు కూడా కొనసాగాయి. ట్రంప్​ ఆదేశాలతో  పెద్దసంఖ్యలో పోలీసులు, నేషనల్​ గార్డ్స్, మెరైన్లు ఓ వైపు మోహరించగా.. మరో వైపు వేలాదిమంది నిరసనకారులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంకావడంతో వీధులన్నీ రణరంగంగా మారాయి. డౌన్​టౌన్​లో చాలామంది ఆందోళనకారులు మెక్సికో, గ్వాటెమాలా, ఇతర జెండాలతో కదం తొక్కారు. ఇమిగ్రేషన్​కస్టమ్స్​ఎన్​ఫోర్సమెంట్​ (ఐసీఈ) ఏరివేత కార్యక్రమాన్ని నిరసిస్తూ ఫెడరల్​ భవనం వద్ద వందలాది మంది గుమికూడి నిరసనలు తెలిపారు.  దాదాపు వందమంది ఫ్రీ వేపైకి చేరుకొని బ్లాక్​ చేయగా.. లాస్​ఏంజెల్స్​ పోలీస్​ డిపార్ట్​మెంట్​ అక్కడకు చేరుకొని వారిని చెదరగొట్టింది. దాదాపు 96 మందిని అరెస్ట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు.

కర్ఫ్యూ విధించిన మేయర్​
నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో డౌన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో అత్యవసర కర్ఫ్యూ విధిస్తున్నట్టు లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజెల్స్​ మేయర్ కరెన్‌‌‌‌‌‌‌‌ బాస్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ఇది మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. డౌన్ టౌన్‌‌‌‌‌‌‌‌ను ధ్వంసం చేసి దుకాణాలను లూటీ చేసినవారు మూల్యం చెల్లించుకోక తప్పదని కరెన్​బాస్ హెచ్చరించారు. కాగా, నియమిత ప్రాంతాల్లో నివసించేవారు, నిరాశ్రయులైన వ్యక్తులు, మీడియా, అత్యవసర సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ చీఫ్ జిమ్ మెక్‌‌‌‌‌‌‌‌డొనెల్ తెలిపారు.

ఇతర రాష్ట్రాలకు పాకిన నిరసనలు 
లాస్​ఏంజెల్స్​లో మొదలైన నిరసనలు మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. మంగళవారం న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లో కూడా ఇమిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. అనేక వేల మంది మాన్‌‌‌‌‌‌‌‌హట్టన్ వీధుల గుండా కవాతు చేశారు. అలాగే,  కాలిఫోర్నియాలోని శాన్‌‌‌‌‌‌‌‌ఫ్రాన్సిస్కో, శాంతా అనా, టెక్సాస్‌‌‌‌‌‌‌‌లోని డల్లాస్​, ఆస్టిన్‌‌‌‌‌‌‌‌, సియాటెల్, లూయీ విల్లే, శాన్‌‌‌‌‌‌‌‌ ఆంటోనియో, షికాగో నగరాల్లోనూ  ఆందోళనకారులు రెచ్చిపోయారు. నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌ చేసిన హెచ్చరిక వ్యాఖ్యలు నిరసనకారులను మరింత రెచ్చిపోయేలా చేశాయి.

బలగాల మోహరింపును సమర్థించుకున్న ట్రంప్​
లాస్​ఏంజెల్స్​లో నిరసనలను అదుపుచేసేందుకు 4వేల మంది నేషనల్​ గార్డ్స్​, 700 మంది మెరైన్లను పంపడాన్ని అధ్యక్షుడు ట్రంప్​ సమర్థించుకున్నారు. ఆందోళనకారులను జంతువులు, విదేశీ శత్రువులని విమర్శించారు.  అమెరికా 250వ ఆర్మీడే సందర్భంగా పోర్ట్‌‌‌‌‌‌‌‌ బ్రాగ్‌‌‌‌‌‌‌‌లోని ఆర్మీ బేస్​లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్​ మాట్లాడారు. అక్రమ వలసదారుల నుంచి లాస్​ఏంజెల్స్​కు విముక్తి కల్పిస్తామని చెప్పారు. విదేశీ శత్రువులు దేశంలోని ఓ నగరాన్ని ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. లాస్​ ఏంజెల్స్​ను మళ్లీ సురక్షిత నగరంగా మారుస్తామని చెప్పారు.

ఎల్ఏలో 9 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్
అమెరికాలోనే లాస్​ ఏంజెల్స్​ అత్యంత విలాసవంతమైన నగరంగా పేరొందింది. అత్యంత సంపన్నులు ఇక్కడ నివాసముంటున్నారు. లాస్​ఏంజెల్స్​ ప్రధాన నగరంలో 39 లక్షల మంది ప్రజలు ఉంటే.. వీరిలో 35శాతం మంది ప్రవాసులే. దాదాపు 9 లక్షల మంది  వలసదారుల వద్ద ఎలాంటి పత్రాలు లేవు.అందువల్లే నగరంలో అక్రమ వలసదారుల ఏరివేతపై తీవ్ర వ్యతిరేకత ఎదురైనట్లు అధికారులు భావిస్తున్నారు.

యాపిల్ స్టోర్ లూటీ
నిరసనల మాటున లాస్​ఏంజెల్స్​లో పలువురు ఆందోళనకారులు చేతివాటం చూపారు.  యాపిల్‌‌‌‌‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌తో సహా పలు షాపుల్లో చొరబడ్డారు. అందిన వస్తువులను లూటీ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. మాస్క్​లు వేసుకున్న కొందరు యాపిల్‌‌‌‌‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించి, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. గ్యాడ్జెట్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. పలువురిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్రంప్కు వ్యతిరేకంగా కోర్టుకు..
తనను సంప్రదించకుండా నేషనల్​ గార్డ్స్​మోహరింపు లెక్కలేనితనమని, స్థానిక బలగాలకు అవమానకరమని కాలిఫోర్నియా గవర్నర్​ న్యూసమ్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించా రు.  కేంద్ర బలగాల మోహరింపుపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దళాలను ఏ విధమైన పోలీసింగ్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌గా ఉపయోగించకుండా నిరోధించాల ని, వారిని ఫెడరల్​భవనాలకు కాపలాగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఇంజక్షన్ జారీ చేయాలని కోరింది. ట్రంప్​తోపాటు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్.. అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్​పై జిల్లా జడ్జి చార్లెస్ బ్రేయర్ గురువారం విచారణ చేపట్టనున్నారు.