
2 గంటల 40 నిమిషాల సేపు సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్. స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో చివరి రెండు పేజీలను చదవకుండానే ప్రసంగం ముగించారు. ఇన్కం టాక్స్ చెల్లింపునకు ఇకపై రెండు విధానాలు.. పాత శ్లాబులతో పాటు కొత్త శ్లాబుల ప్రకటన. ట్యాక్స్ పేయర్లే ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం. కొత్త స్లాబ్లో 70 శాతం మినహాయింపుల తొలగింపు. బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత భద్రత. బ్యాంక్ డిపాజిట్లపై ఇన్స్యూరెన్స్ కవరేజీ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు రూ.1.7 లక్షల కోట్ల కేటాయింపు. ఉడాన్ స్కీమ్కు ప్రోత్సాహం కలిగించేలా 2024 నాటికి దేశంలో మరో 100 ఎయిర్ పోర్ట్ల అభివృద్ధికి చర్యలు. ఇంటర్నేషనల్, నేషనల్ రూట్లలో కృషి ఉడాన్ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు. బెంగళూరులో మెట్రో తరహాలో సబర్బన్ రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు రూ.18,600 కోట్లు.
నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఇకపై ఒకే పరీక్ష. ఇందు కోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 150 తేజస్ రైళ్లు. పర్యాటక కేంద్రాలతో లింకింగ్. రైల్వే ట్రాక్లకు రెండువైపులా సోలార్ కేంద్రాలు. చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు ఏడాది పాటు ట్యాక్స్ హాలీడే. కంపెనీలపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు. దీనిపై పన్నును రిసీవర్లే చెల్లించాలి. రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఆడిటింగ్ మినహాయింపు. ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీలో వాటాల విక్రయం. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్. స్టాక్మార్కెట్లో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల కోట్ల మూలధన సాయం. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణకు చర్యలు. సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కోసం రూ.4,400 కోట్లు. హెరిటేజ్ పరిరక్షణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఏర్పాటు. లక్ష గ్రామాలకు ఓఎఫ్సీ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ. నేషనల్ గ్రిడ్తో లక్ష గ్రామాల అనుసంధానం
ఇండియాలో చదవాలనుకునే విదేశీ స్టూడెంట్ల కోసం స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం.. ఇండ్ శాట్. త్వరలో కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకటన. వ్యవసాయ రంగం అభివృద్ధికి 16 సూత్రాల పథకం. సోలార్ పంప్ సెట్ల స్కీమ్ మరో 20 లక్షల మంది రైతులకు వర్తింపు. పాలు, మాంసం, చేపల వంటి వాటి రవాణా కోసం కిసాన్ రైలు. కాశ్మీరీ కవి పండిట్ దీనానాత్ కౌల్ నదీమ్, కవితలు, భక్తురాలు అవ్వయార్ సూక్తులు, తిరువళ్లువర్ రచనల్లోని ఐదు లక్షణాలు, మహాకవి కాళిదాసు రాసిన వాక్యాల ప్రస్తావన. నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
దేశంలో మొబైల్ఫోన్లు, ఎలక్ట్రిక్ వస్తువుల తయారీని ప్రోత్సహించేందుకు కొత్త పథకం. ఒక మేజర్ పోర్ట్ను కార్పొరేటైజ్ చేసేందుకు సన్నాహాలు. వచ్చే మూడేళ్లలో పాత విద్యుత్ మీటర్ల స్థానంలో ప్రిపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు. దీని ద్వారా తమకు కావాల్సిన సప్లయర్ను కన్స్యూమర్ ఎంపిక చేసుకునే అవకాశం. అమ్మాయిల మ్యారేజ్ ఏజ్పై సూచనల కోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదన.