పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి : బిక్షం గౌడ్

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి : బిక్షం గౌడ్

వనపర్తి టౌన్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ  స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్షం గౌడ్ కోరారు. బుధవారం  జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 15 లోగా  బిల్లులను చెల్లించాలన్నారు. ఎలక్షన్​ ముగియగానే  ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు.

Also Read :- గజ్వేల్‌లో నామినేషన్‌ వేసిన సీఎం కేసీఆర్‌

అనంతరం కొత్త జిల్లా కమిటీ ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా టి.మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా ఆర్.శ్రీనివాసులును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో  బాలరాజు, కేశవులు, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులు, ప్రేమలత పాల్గొన్నారు.