- నోటిఫికేషన్ జారీ చేసిన స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
- డిసెంబర్ 3న ఆర్కేపీ ఓసీపీ ఆఫీస్లో ప్రజాభిప్రాయ సేకరణ
కోల్బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా పరిధి రామకృష్ణాపూర్ సింగరేణి ఓపెన్కాస్ట్ మైన్రెండో ఫేజ్ పర్యావరణ అనుమతి కోసం పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ రీజియన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్3న ఉదయం10.30 గంటలకు రామకృష్ణాపూర్ ఓసీపీ ప్రాజెక్ట్ సమీపంలో పబ్లిక్ హియరింగ్చేపట్టనున్నారు. రెండో ఫేజ్లో సేకరించనున్న అటవీ భూముల అనుమతికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో సభను నిర్వహించనున్నారు.
రూ.442.90 కోట్లతో రెండోఫేజ్ పనులు
2013లో ఆర్కేపీ ఓసీపీ మైన్ప్రారంభ సమయంలో ఎంకే4, 4ఏ గనులను సింగరేణి మూసివేసింది. అంతకుముందు మూతపడ్డ ఆర్కే-4 గనిలో మిగిలిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు రామకృష్ణాపూర్గనిని చేపట్టింది. 2024 –-25 ఆర్థిక సంవత్సరం వరకు 1,60,19,293 టన్నుల బొగ్గును వెలికితీసింది. కాగా అక్కడ స్థలాలు లేకపోవడం, రెండోఫేజ్స్థలాలకు పర్మిషన్రాకపోవడంతో గత ఏప్రిల్3న అధికారికంగా ఆర్కేపీ ఓసీపీని మూసివేసింది. అక్కడి ఉద్యోగులను ఇతర గనులకు బదిలీ చేసింది. రెండోఫేజ్లో 1,209.24 హెక్టార్ల స్థలం అవసరమవగా, ఇందులో 597.45 హెక్టార్లు అటవీ భూమి,611.79 హెక్టార్లు ఇతర భూములు ఉన్నాయి.
ఇవి మూసివేసిన ఆర్కే1ఏ,ఆర్కే3,ఎం-4,ఆర్కే-4 బొగ్గు గనుల ప్రాంతంలో ఉండడంతో రెండో ఫేజ్పర్మిషన్ కోసం ఇప్పటికే సింగరేణి కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. పబ్లిక్ హియరింగ్ తర్వాత అటవీ భూములకు పర్మిషన్లు వస్తే రూ.442.90 కోట్లతో మైనింగ్కార్యకలాపాలు చేపడుతామని సింగరేణి పేర్కొంది. గనిలో బొగ్గు ఉత్పత్తి ఏటా 3.75 మిలియన్టన్నుల చొప్పున 18ఏండ్ల పాటు బొగ్గు తవ్వకాలు చేపట్టనుంది. ఓసీపీ రెండో ఫేజ్లో సేకరించే భూములు మందమర్రి, నస్పూర్, మంచిర్యాల మండలాల పరిధిలోకి చెందినవి.
