కేంద్ర పథకాలపై ప్రచారం చేయాలి

కేంద్ర పథకాలపై ప్రచారం చేయాలి

మెదక్ టౌన్/సంగారెడ్డి టౌన్/కంది/కొండాపూర్/కొమురవెల్లి, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని ఆయా రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలకు సూచించారు. గురువారం ఉమ్మడి మెదక్​ జిల్లాలోని పలుచోట్ల నిర్వహించిన అసెంబ్లీ ప్రవాసీ యోజన కార్యక్రమాలకు వారు హాజరయ్యారు.  మెదక్​లో కర్ణాటక రాష్ట్రం ఉడిపి ఎమ్మెల్యే సురేశ్​శెట్టి, కొమురవెల్లిలో కర్ణాటకలోని తీర్థల్ ఎమ్మెల్యే సిద్ధు సవాడి, సంగారెడ్డిలో

కొండాపూర్​లో, కంది మండలం మామిడిపల్లిలో ఉత్తర్‌‌ప్రదేశ్‌‌ కు చెందిన ఎమ్మెల్సీ అవినాష్‌‌ సింగ్‌‌ పటేల్‌‌ స్థానిక నేతలతో కలిసి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీఆర్​ఎస్​ను గద్దె దింపి బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలనపై  తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్​ఎస్​ మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని  నెరవేర్చకపోగా మరిన్నీ హామీలు ఇస్తూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.