విషాదం: ఎక్సర్ సైజ్ చేస్తూ ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

విషాదం: ఎక్సర్ సైజ్ చేస్తూ ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

పూణేలోని  మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో(CME) విషాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జింగ్ ఎక్సర్ సైజ్ చేస్తూ ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. కాలేజ్‌లోని సాంకేతిక శిక్షణా కేంద్రంలో మొబైల్‌ బ్రిడ్జిపై శిక్షణ కొనసాగుతుండగా ఈ సంఘటన జరిగిందని రక్షణ అధికారులు తెలిపారు. గాయాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన కి  సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.