పంజాబ్ లో వీఐపీల భద్రత తొలగింపు

పంజాబ్ లో వీఐపీల భద్రత తొలగింపు

చండీగఢ్: పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 184 మంది వీఐపీల భద్రతను ఉపసంహరిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు సెక్యూరిటీ తొలగించిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం వారికి ఉన్న ముప్పును అంచనా వేసి ఈ చర్యలు చేపట్టినట్లు అడిషినల్ డీజీపీ తెలిపారు.

ఇక భద్రత తొలగించిన వారిలో మాజీ సీఎం సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ కుటుంబీకులు, మాజీ మంత్రులు బీబీ జాగీర్‌ కౌర్, మదన్‌ మోహన్‌ మిట్టల్, సుర్జిత్‌ కుమార్‌ రఖ్రా, సుచా సింగ్‌ చోటేపూర్, జనమేజా సింగ్‌ సెఖోన్, తోట సింగ్, గుల్జార్‌ సింగ్ రాణికే ఉన్నారు. భద్రత కోల్పోయినవారిలో మాజీ ఎంపీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా, మహి గిల్, మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ కుమారుడు సిధాంత్ భద్రతను కోల్పోనున్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆప్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే.. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్‌ పార్టీలకు చెందిన 122 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు రెండో సారి కూడా ప్రభుత్వం మరికొంత మంది వీఐపీల భద్రతను తొలగించింది. 

మరిన్ని వార్తల కోసం...

పాక్ డిగ్రీలు చెల్లవ్

మిల్లర్లపై రెవిన్యూ రికవరీ యాక్టు ప్రయోగించాలె

బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీలకు భయం