ఇండియా స్టార్ షట్లర్, డబుల్ ఒలింపియన్ మెడలిస్ట్ పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో ఐదో ప్లేస్లోకి వచ్చింది. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో సింధు ఖాతాలో 87,218 పాయింట్లు ఉన్నాయి. కామన్వెల్త్ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరంగా ఉన్న సింధు.. సోమవారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. గతంలో రెండో ర్యాంక్లో ఉన్న సింధు.. దాదాపు మూడేళ్ల తర్వాత ఐదో ర్యాంక్కు చేరుకోవడం విశేషం.
సైనా నెహ్వాల్ 33వ ర్యాంక్కు పడిపోయింది. థామస్ కప్ విన్నర్ హెచ్.ఎస్. ప్రణయ్.. 12వ ర్యాంక్లోకి దూసుకురాగా, కిడాంబి శ్రీకాంత్ 11వ ర్యాంక్లోనే కొనసాగుతున్నాడు. యంగ్ షట్లర్ లక్ష్యసేన్ ఎనిమిదో ర్యాంక్లో ఉన్నాడు. డబుల్స్లో సాత్విక్–చిరాగ్ జోడీ.. ఎనిమిదో ర్యాంక్లో కొనసాగుతోంది. విమెన్స్ డబుల్స్లో అశ్విని–సిక్కిరెడ్డి 24 వ ప్లేస్లో, గాయత్రి–ట్రీసా 27వ ర్యాంక్లో ఉన్నారు.