న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో 2020 ఏడాదికి గాను పద్మ అవార్డులు గెల్చుకున్న వారికి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. తెలుగు తేజం, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. కాగా, 2020లో మొత్తంగా 119 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వీరిలో దివంగత సుష్మా స్వరాజ్కు పద్మ విభూషణ్ వచ్చింది. సుష్మా కూతురు అవార్డును స్వీకరించారు. ఇకపోతే, దివంగత కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీతోపాటు గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్, బాక్సర్ మేరీ కోమ్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రాకు కేంద్రం పద్మ భూషణ్ ప్రకటించింది.
Delhi: Olympian badminton player PV Sindhu awarded the Padma Bhushan pic.twitter.com/TqUldnQgr3
— ANI (@ANI) November 8, 2021