
హైదరాబాద్, వెలుగు: ‘రాడిసన్ బ్లూ ప్లాజా, బంజార హిల్స్’ హైదరాబాద్లో జరిగిన వరల్డ్ టూరిజం డే 2025 వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి టూరిజం ఎక్స్లెన్స్ అవార్డ్ను అందుకుంది.
5-స్టార్ హోటల్ కేటగిరీలో దీనిని పొందింది. ఈ అవార్డ్ను హోటల్ తరఫున సంస్థ సౌత్ ఇండియా జనరల్ మేనేజర్ సందీప్ జోషి, హోటల్ సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజర్షి భట్టాచార్జీ అందుకున్నారు. హోటల్ అందిస్తున్న క్వాలిటీ సర్వీస్కు ఈ అవార్డు నిదర్శనమని రాడిసన్ బ్లూ ప్లాజా ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపింది.