నల్గొండ ఎంపీ సీటుకు రఘువీర్ రెడ్డి దరఖాస్తు

నల్గొండ ఎంపీ సీటుకు రఘువీర్ రెడ్డి దరఖాస్తు

హాలియా, వెలుగు : నల్గొండ పార్లమెంట్‌‌ స్థానం కోసం నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘు వీర్​ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తమ్ముడు సాగర్‌‌‌‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హైదరాబాద్‌‌లోని గాంధీభవన్‌‌లో అప్లికేషన్ ఫామ్ అందజేశారు.  

తన అన్న రఘువీర్ రెడ్డి తరఫున  దరఖాస్తు చేసినట్లు ఆయన చెప్పారు. ఆయన వెంట పీసీసీ డెలిగేట్​ జేజే సైదయ్య బాబు, రాష్ట్ర నాయకులు మిట్టపల్లి వెంకటేశ్, గడ్డంపల్లి వినయ్ రెడ్డి ఉన్నారు.