తిరువంబాడి(కేరళ):కేరళ పర్యటనలో రాహుల్గాంధీ ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించి, ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. క్షేమ సమచారాలు విచారిస్తూ ఆమె అందించిన కానుకలను స్వీకరించారు. ఆమె.. రాజమ్మ వవథిల్. సరిగ్గా 49 ఏళ్ల క్రితం హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో రాహుల్గాంధీ జన్మించినపుడు డ్యూటీలో ఉన్నది ట్రైనీ నర్స్ రాజమ్మే.. పుట్టిన కాసేపటికి రాహుల్ను ఎత్తుకున్న కొద్దిమందిలో రాజమ్మ కూడా ఒకరు. నర్స్గా ఆర్మీకి సేవలందించిన రాజమ్మ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి, కుటుంబంతో కేరళలో సెటిలయ్యారు. ఇటీవల రాహుల్పౌరసత్వంపై వివాదం రేగడంతో.. ఆయన ఢిల్లీలోని ఆస్పత్రిలో జన్మించారనడానికి తానే సాక్ష్యమని రాజమ్మ చెప్పారు. తాజాగా రాహుల్ వయనాడ్పర్యటనకు రాగా.. కుటుంబంతో వెళ్లి రాహుల్ను కలుసుకున్నారు. పొత్తిళ్లలో చూసిన పసికందును మళ్లీ ఇన్నాళ్లకు ప్రత్యక్షంగా చూడడంతో రాజమ్మ భావోద్వేగానికి గురయ్యారు. రాహుల్కోసం స్వయంగా చేసి తీసుకొచ్చిన స్వీట్లు, చిప్స్ను ఆయనకందించారు.
బీజేపీది సవతి తల్లి ప్రేమ
బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని కాంగ్రెస్చీఫ్రాహుల్గాంధీ ఆరోపించారు. ఆయన దృష్టిలో కేరళ ఎన్నటికీ ఉత్తరప్రదేశ్కాలేదని చెప్పారు. వయనాడ్పర్యటనలో భాగంగా మూడో రోజు రాహుల్కోజికోడ్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంగప్పూజ ప్రాంతంలో రాహుల్మాట్లాడుతూ.. కోపం, విద్వేషాలతో బీజేపీ కళ్లు మూసుకుపోయాయని ఆరోపించారు. ఆరెస్సెస్భావజాలాన్ని పాటించని వారు ఇండియన్లే కాదన్నట్లుగా ప్రవర్తిస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకలా, నాన్బీజేపీ పాలిత రాష్ట్రాలను మరొకలా ట్రీట్చేస్తున్నారని ప్రధానిపై విమర్శలు గుప్పించారు. వారణాసి లాగే కేరళ పైనా తనకు అభిమానం ఉందన్న ప్రధాని వ్యాఖ్యలను రాహుల్కొట్టిపారేశారు. ప్రధాని దృష్టిలో యూపీ వేరు, కేరళ వేరన్నారు. కేరళ సీపీఎం పాలనలో ఉండడం వల్ల వయనాడ్అభివృద్ధి విషయంలో ప్రధాని మోడీ తనకు సహకరిస్తారనే ఆశలేదని రాహుల్ చెప్పారు. సీపీఎం, కాంగ్రెస్ ల మధ్య సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నా వాటన్నిటినీ పక్కనపెట్టి వయనాడ్అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం సీపీఎం కల్పెట ఎమ్మెల్యేతో భేటీ అయిన విషయాన్ని రాహుల్గుర్తుచేశారు. తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని ఇతర సమస్యలను కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తానని కేరళ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.
రాహుల్వి నీడ్యూ..
రాష్ట్రంలో రాహుల్రోడ్షో కు స్థానికుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. మహిళలు, పిల్లలు, యువతతో పాటు పార్టీ కార్యకర్తలు వందలాదిగా రోడ్షోలో పాల్గొన్నారు. దారి పొడవునా రాహుల్ జిందాబాద్ అన్న నినాదాలు మార్మోగాయి. యువత ‘రాహుల్.. వి నీడ్యూ’, ‘రాహుల్పాడా(ఆర్మీ)’ అనే స్లోగన్లు రాసున్న టీ షర్టులు వేసుకుని రోడ్షోలో పాల్గొన్నారు.