బట్లర్ బాదుడు..హిట్ మేయర్ దంచుడు..199 రన్స్ చేసిన రాజస్థాన్

బట్లర్ బాదుడు..హిట్ మేయర్ దంచుడు..199 రన్స్ చేసిన రాజస్థాన్

ఢిల్లీ బౌలర్లను రాజస్థాన్ రాయల్స్ ఊచకోత కోసింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్ అర్థ సెంచరీలతో చెలరేగడంతో ..రాజస్థాన్ భారీ స్కోరు సాధించింది. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఢిల్లీ బౌలర్లను చితక్కొట్టారు. వీరిద్దరు తొలి వికెట్కు ఏకంగా 98 పరుగులు జోడించారు. ముఖ్యం యశస్వీ జైస్వాల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 60 పరుగులు సాధించారు. 

వరుసగా వికెట్లు..

అయితే 30 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్ను ముఖేష్ కుమార్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ డకౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన రియాన్ పరాగ్ 7 పరుగులే చేసి పావెల్ బౌలింగ్లో  బౌల్డ్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 126 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

బట్లర్ విధ్వంసం...

ఈ సమయంలో జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 79 పరుగులతో రెచ్చిపోయాడు. అతనికి సిమ్రన్ హెట్ మెయర్ ( 39: 21 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు)సంచలన బ్యాటింగ్తో సహకరించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో  ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయగా..కుల్దీప్ యాదవ్, పావెల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.