రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ బహిష్కరించిన మంత్రి రాజేంద్ర సింగ్కు ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనను శాసనసభలోకి వెళ్లనివ్వకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని మీడియాకు చెబుతూ ఆయన బోరుమన్నారు. సీఎం అశోక్ గహ్లోత్ అవినీతి చిట్టాత తన వద్ద ఉందని, బండారాన్ని బయటపెడతానని రాజేంద్ర సింగ్ ఇటీవల ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు రాజస్థాన్ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు పరస్పరం దూషణలకు దిగారు. దీంతో సీఎం అతన్ని బర్తరఫ్ చేశారు. అయితే జులై 24న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి రాజేంద్ర సింగ్ రాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన్ని అడ్డుకున్నారు.
ALSO READ:గచ్చిబౌలిలో దారుణం.. కదులుతున్న బస్సు టైరు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
ఇదే విషయంపై రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. 50 మంది నేతలు తనపై అటాక్ చేసినట్లు చెప్పారు. శాసనసభ నుంచి తనను బయటకు గెంటేసినట్లు విలపించారు. తన వద్ద అవినీతి తాలుకూ వివరాలున్న రెడ్ కలర్డైరీ గురించి అసెంబ్లీ ఛైర్మన్ మాట్లాడకుండా చేశారన్నారు. రాష్ట్రంలో రూ.100 నుంచి 500 కోట్ల అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. గహ్లోత్ సన్నిహితుడు ధర్మేంద్ర సింగ్ రాథోడ్ ఇంట్లో ఐడీ సోదాలు జరిగినప్పుడే తనకు రెడ్ డైరీ దొరికినట్టు చెప్పారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ తన సొంత సీనియర్ నేత రాజేంద్ర గూడను కొట్టిన తీరు సిగ్గుచేటని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ పేర్కొంది. బీజేపీ అధికారంలోకి రాగానే అక్రమార్కుల భరతం పడతామని ఆ పార్టీ నేతలు తెలిపారు.