50 మంది ఎమ్మెల్యేలు నన్ను కొట్టారు.. ఈడ్చుకెళ్లారు : బోరున ఏడ్చిన మాజీ మంత్రి రాజేంద్ర

50 మంది ఎమ్మెల్యేలు నన్ను కొట్టారు.. ఈడ్చుకెళ్లారు : బోరున ఏడ్చిన మాజీ మంత్రి రాజేంద్ర

రాజస్థాన్​ కాంగ్రెస్​ సర్కార్​ బహిష్కరించిన మంత్రి రాజేంద్ర సింగ్​కు ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనను శాసనసభలోకి వెళ్లనివ్వకుండా కాంగ్రెస్​ నేతలు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని మీడియాకు చెబుతూ ఆయన బోరుమన్నారు. సీఎం అశోక్​ గహ్లోత్​ అవినీతి చిట్టాత తన వద్ద ఉందని,  బండారాన్ని బయటపెడతానని రాజేంద్ర సింగ్​ ఇటీవల ఆరోపించారు. 

ఈ వ్యాఖ్యలు రాజస్థాన్​ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష బీజేపీలు పరస్పరం దూషణలకు దిగారు. దీంతో సీఎం అతన్ని బర్తరఫ్​ చేశారు. అయితే జులై 24న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి రాజేంద్ర సింగ్​ రాగా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఆయన్ని అడ్డుకున్నారు. 

ALSO READ:గచ్చిబౌలిలో దారుణం.. కదులుతున్న బస్సు టైరు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ఇదే విషయంపై రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. 50 మంది నేతలు తనపై అటాక్​ చేసినట్లు చెప్పారు. శాసనసభ నుంచి  తనను బయటకు గెంటేసినట్లు విలపించారు. తన వద్ద అవినీతి తాలుకూ వివరాలున్న రెడ్​ కలర్​డైరీ గురించి అసెంబ్లీ ఛైర్మన్​ మాట్లాడకుండా చేశారన్నారు. రాష్ట్రంలో రూ.100 నుంచి 500 కోట్ల అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. గహ్లోత్​ సన్నిహితుడు ధర్మేంద్ర సింగ్​ రాథోడ్ ఇంట్లో ఐడీ సోదాలు జరిగినప్పుడే తనకు రెడ్​ డైరీ దొరికినట్టు చెప్పారు. 

అసెంబ్లీలో కాంగ్రెస్ తన సొంత సీనియర్ నేత రాజేంద్ర గూడను కొట్టిన తీరు సిగ్గుచేటని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ పేర్కొంది. బీజేపీ అధికారంలోకి రాగానే అక్రమార్కుల భరతం పడతామని ఆ పార్టీ నేతలు తెలిపారు.