జైపూర్: టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష రాసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరుగురు చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డరు. రాజస్థాన్లోని చక్సు ఏరియాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. శనివారం పదకొండు మంది బరన్ నుంచి సికర్ కు వ్యాన్ లో వెళ్తున్నరు. చక్సు ఏరియాలో ఆగి ఉన్న లారీని వాళ్ల వ్యాన్ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అభ్యర్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురికి గాయాలవడంతో ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అయితే, వ్యాన్ లో ఉన్నవాళ్లంతా టీచర్ ఉద్యోగాలకు జరగబోయే ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్ టెస్ట్ రాసేందుకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయాలైనోళ్లకు50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ట్రాన్స్పోర్టు బస్సుల ను ఉపయోగించాలని సూచించారు. ప్రాణాల కంటే ఏ ఎగ్జామ్కూడా ముఖ్యం కాదని గెహ్లాట్ చెప్పారు. కాగా, ప్రభుత్వ స్కూళ్లలో 31 వేల టీచర్ పోస్టుల భర్తీకి జరిగే ఈ టెస్ట్కు రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కీలకమైన ఈ పరీక్ష గతంలో ఐదుసార్లు వాయిదా పడటంతో ఈ సారి నిర్వహణకు రాష్ట్ర సర్కారు పకడ్బంధీ చర్యలు చేపట్టింది.
ఎగ్జామ్కు వెళ్తుంటే ప్రమాదం.. ఆరుగురు మృతి
- దేశం
- September 26, 2021
లేటెస్ట్
- కాళ్లు మొక్కినా మళ్లీబీఆర్ఎస్ లోకి రానియ్యం: హరీశ్ రావు
- నోర్జ్ గాడిలో పడతాడు: హోప్స్
- ఒకేసారి మొత్తం రుణమాఫీ చేస్తం...మంత్రి తుమ్మల
- ఖమ్మంలో వర్సిటీ ఇంకెప్పుడు?
- చిన్న టౌన్లలో వర్కర్లకు ఫుల్ గిరాకీ
- సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు - ఎడీఆర్ రిపోర్ట్
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు...కిషన్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఐటీ నోటీసులు
- నా బెస్ట్ ఓవర్ ఇదే అవేశ్ ఖాన్
- యూజీ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగ్!
Most Read News
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- Premalu OTT: మూవీ లవర్స్కి బ్యాడ్ న్యూస్.. ప్రేమలు OTT రిలీజ్ మరింత ఆలస్యం!
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్లో పొగలు