ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యేలా డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు

ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యేలా డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. కృష్ణ పోలూరు దర్శకత్వంలో  కె.వి. శ్రీరామ్ నిర్మించారు.  ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రాజీవ్ కనకాల మాట్లాడుతూ  ‘నేను ఇప్పటివరకు ఎన్నో  రకాల పాత్రల్ని పోషించా.  అయితే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేసిన క్యారెక్టర్ మాత్రం మైల్ స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా నిలుస్తుంది.  ఇందులోని  నా మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్స్ అన్నీ  కొత్తగా ఉంటాయి.  

ఈ సిరీస్  ఏ ఒక్కరినీ  నిరాశపర్చదు.. బోలెడన్ని ట్విస్టులు కూడా ఉంటాయి’ అని చెప్పారు.   ఉదయభాను మాట్లాడుతూ  ‘ఈ కథకు, పాత్రకు ఓ తల్లిగా కనెక్ట్ అయ్యాను.  పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలనే కోరిక ఈ సిరీస్ ద్వారా నెరవేరింది. ఇప్పుడున్న సమాజానికి  ఎంతో అవసరమైన సిరీస్ ఇది’ అని చెప్పారు. మంచి ఎమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సాగే ఈ సిరీస్  ప్రతి కుటుంబాన్ని ఆకట్టుకుంటుందని  దర్శకుడు కృష్ణ పోలూరు అన్నాడు.   నిర్మాత కె.వి. శ్రీరామ్ మాట్లాడుతూ  ‘ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే సిరీస్ ఇది.  ఇందులోని ఒక్కో  ఎపిసోడ్  క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా ఉంటుంది. చివరివరకు థ్రిల్ మెయింటైన్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించిన గాయత్రి భార్గవి, వాసంతిక, డైలాగ్ రైటర్ శృతి,  కెమెరామెన్ మహేష్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.