
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్ హెడ్గా రాజీవ్ ఖుల్బే నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కెమికల్ టెక్నాలజీలో కాన్పూర్ ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన ఆయన మూడు దశాబ్దాలుగా ఎరువుల ఉత్పత్తి రంగంలో పని చేస్తున్నారు.
1988లో నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్)లో మేనేజ్మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగారు. ఆయనకు వివిధ విభాగాలకు చెందిన ఆఫీసర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ను సమర్థంగా నడిపిస్తూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఎరువుల కొరత తీర్చడంలో కీలకంగా వ్యవహరిస్తానని తెలిపారు.