సోదరభావానికి ప్రతీక రాఖీ

సోదరభావానికి ప్రతీక రాఖీ

ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే మహిళలు సోదరులకు రాఖీ కట్టడానికి పరుగులు పెట్టారు. దీంతో పట్టణాల్లోని బస్టాండులు కిటకిటలాడాయి. రాఖీ, స్వీట్ షాపులు రద్దీగా మారాయి.  సీఎం రేవంత్​రెడ్డికి రామచంద్రపురం కార్పొరేటర్​పుష్ప, బీసీ కమిషన్​ మెంబర్​ రంగు బాలలక్ష్మి రాఖీ కట్టగా, హుస్నాబాద్​క్యాంపు ఆఫీసులో మంత్రి పొన్నం ప్రభాకర్​కు స్థానిక మహిళా నాయకులు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు.

మంత్రి  దామోదర రాజనర్సింహకు మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ సిబ్బంది రాఖీ కట్టి విషెస్ ​చెప్పారు. బీఆర్ఎస్​నాయకులు కేటీఆర్​కు భారతీనగర్​ కార్పొరేటర్​ సింధు ఆదర్శ్​రెడ్డి, హరీశ్​రావుకు మునిపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పైతర మీనాక్షి రాఖీ కట్టారు. కాంగ్రెస్​నేత కాట శ్రీనివాస్​గౌడ్​కు  ఇందిరాశోభన్, హరికృష్ణకు పార్టీ మహిళా కార్యకర్తలు రాఖీ కట్టారు. 
- వెలుగు, నెట్​వర్క్​