బాలీవుడ్లో బిజీ అయ్యింది.. లగ్జరీ కారు కొంది!

బాలీవుడ్లో బిజీ అయ్యింది.. లగ్జరీ కారు కొంది!

తెలుగులో చేసిన మన్మథుడు–2(Manmadudu2) సినిమా రకుల్​ ప్రీత్ సింగ్(Rakul preet singh)​ కెరీర్​ను ఇరకాటంలో పడేసింది. ఈ మూవీ డిజాస్టర్​తో బాలీవుడ్​ బాట పట్టిన రకుల్​ ప్రస్తుతం అక్కడ బిజీ హీరోయిన్​గా మారింది. ఇటీవల ఈ అమ్మడు ఓ లగ్జరీ కారు కూడా కొనేసింది. దాదాపు రూ.3 కోట్లు పెట్టి మెర్సిడెస్​ బెంజ్​ మేబాక్​ జీఎల్​ఎస్​ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

ALSO READ :ఇతను షారుఖ్ ఖాన్ కాదు.. నమ్మరా?.. అయితే ఇది చూడండి

ఈ ఫొటోలు నెట్టింట వైరల్​ కాగా రకుల్ కు ఫ్యాన్స్​ కంగ్రాట్స్​ చెప్తున్నారు. దీంతో బాలీవుడ్​లో ఈ హీరోయిన్​కు బాగానే వర్కవుట్​ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ‘బూ’ అనే సిరీస్​తో ఓటీటీలోకి కూడా రకుల్​ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అర్జున్​ కపూర్​తో ‘మేరే హస్బెండ్​కీ బీవీ’, అజయ్​ దేవగణ్​తో ‘దేదే ప్యార్​ దే–2’లో ఈ పంజాబీ బ్యూటీ నటిస్తోంది. దీంతో ఇప్పట్లో తెలుగులో రకుల్​ను చూసే చాన్స్​ లేనట్టే తెలుస్తోంది.