షాద్ నగర్ కిరాతకుల్ని కుక్కలతో పోల్చిన వర్మ

షాద్ నగర్ కిరాతకుల్ని కుక్కలతో పోల్చిన వర్మ

వెటర్నరీ డాక్టర్ హత్యకేసు నిందితుల్ని డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ కుక్కలతో పోల్చాడు.

షాద్ నగర్ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల్ని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మృగాళ్లలా దాడికి తెగబడ్డ మానవమృగాళ్లపై అంత ఊదాసీనత చూపించడం తగదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ గతంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ నిందితుల్ని కఠినంగా శిక్షించినా కిరాతకుల్లో మార్పురాలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన నిందితుల్లో మార్పురాలేదన్నారు. మానసిక సామర్ధ్యంలేని కుక్కలు ఇతర కుక్కలకు ఏం జరిగిందో తెలుసుకోలేవని ట్వీట్ చేశారు.

MORE NEWS:

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

వెటర్నరీ డాక్టర్ ఘటనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు

వెటర్నరీ డాక్టర్ నిందితుల కంటే అడవికుక్కలే మేలన్నారు. దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేయడంలో తప్పులేదన్న..ఆర్జీవీ ఇలాంటివి ఇకపై పునరావృతం కాకుండా భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.