ఢిల్లీలో రామ మందిర దర్శన అభియాన్ మీటింగ్

ఢిల్లీలో రామ మందిర దర్శన అభియాన్ మీటింగ్

న్యూఢిల్లీ, వెలుగు: అయోధ్య రామ మందిర దర్శనం విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బీజేపీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రాల వారిగా పార్టీ శ్రేణులకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా ‘రామ మందిర దర్శన అభియాన్’పేరుతో మంగళవారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో కీలక సమావేశం జరిగింది. 

ఇందులో తెలంగాణ నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు వెంకట రమణా రెడ్డి, సూర్య నారాయణ, సీనియర్ నేత శ్రీరాములు యాదవ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రామ మందిర దర్శనానికి వెళ్లే భక్తులకు కావాల్సిన సదుపాయాలు, యాత్రకు సంబంధించి అన్ని విధాలుగా సహకరించాలని వారికి నడ్డా సూచించారు.