Ram Pothineni: 'ఆంధ్రా కింగ్ తాలూకా'‌తో రామ్ బిగ్ ప్లాన్! ఈసారైనా హిట్ కొట్టేనా?

Ram Pothineni: 'ఆంధ్రా కింగ్ తాలూకా'‌తో రామ్ బిగ్ ప్లాన్! ఈసారైనా హిట్ కొట్టేనా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ మహేష్ బాబుల కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, ఈ సినిమా కోసం పూర్తిస్థాయిలో తనని తాను అంకితం చేసుకున్నారు. కేవలం హీరోగా నటించడమే కాకుండా, సినిమాలోని ప్రతి అంశంలోనూ ఆయన భాగస్వామ్యం ఉంటుందని తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రొమో సాంగ్ రిలీజ్ చేశారు. ఇది అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

ఈ చిత్రంలో యువ నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మహేష్ బాబు మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ సినిమాకు రామ్ ఇచ్చిన సహకారం సినిమా స్థాయిని మరింత పెంచుతుందని సమాచారం.

సాధారణంగా హీరోలు తమ పాత్రకు మాత్రమే పరిమితమవుతారు, కానీ రామ్ ఈ సినిమా కోసం చాలా కొత్త ప్రయోగాలు చేశారు. ఈ సినిమాలో ఒక పాటకి స్వయంగా ఆయనే లిరిక్స్ అందించడం విశేషం. అంతేకాకుండా, మరో పాటను తానే స్వయంగా పాడారు. ఇది ఆయనలో ఉన్న మరో కోణాన్ని వెలికితీస్తోంది. ఇంతకుముందు రామ్ ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. కానీ వాటికి వచ్చిన స్పందన చూసి ఈసారి సొంతంగా లిరిక్స్ రాసినట్లు తెలుస్తోంది. కేవలం సంగీతంలోనే కాకుండా, స్క్రిప్ట్ విషయంలోనూ డైరెక్టర్‌కు అవసరమైన ఇన్‌పుట్స్ ఇచ్చి, కథనాన్ని మరింత పటిష్టం చేశారని సమాచారం. సినిమాలోని సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా ఉండేందుకు రామ్ విలువైన సూచనలు చేశారని చిత్ర బృందం చెబుతోంది.

►ALSO READ | Ashish Warang : సినీ పరిశ్రమలో విషాదం.. 'దృశ్యం' నటుడు ఆశిష్ వారంగ్ మృతి..

ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని రామ్ గట్టిగా టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమాకు ఏం కావాలన్నా తాను రెడీ అని దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సినిమాకు మరో బలం, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇందులో ఒక ముఖ్యమైన క్యామియో రోల్ చేస్తుండటం. ఉపేంద్ర పాత్ర సినిమాకు కీలక మలుపునిస్తుందని, ప్రేక్షకులకు ఒక సర్ ప్రైజ్ గా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ  'ఆంధ్రా కింగ్ తాలూకా'సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలని నిర్మాతలు లాక్ చేశారు. ఆ డేట్‌కి పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో,  'ఆంధ్రా కింగ్ తాలూకా' సోలో రిలీజ్‌గా రావడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సోలో రిలీజ్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించడానికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. మరి రామ్ ఆశించినట్లుగా ఈ సినిమా ఒక బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందా, లేదా అనేది వేచి చూడాలి.