భద్రాద్రి ఆలయ ఇంఛార్జ్ ఈవోగా రమా దేవి బాధ్యతలు

భద్రాద్రి ఆలయ ఇంఛార్జ్ ఈవోగా రమా దేవి బాధ్యతలు

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా దేవి భద్రాద్రి ఆలయ ఇంఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన నూతన ఈవోకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాన ఆలయంలోని సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో వేద పండితులు అందించిన వేద ఆశీర్వాదాలను స్వీకరించారు.