బీజేపీలో చేరిన రామకృష్ణ గుప్తా

బీజేపీలో చేరిన రామకృష్ణ గుప్తా

లింగంపేట,వెలుగు: బీఆర్ఎస్​ సెన్సార్​ బోర్డ్​మెంబర్, లింగంపేట మండలం సురాయిపల్లికి చెందిన అతిమాముల రామకృష్ణ గుప్తా ఆదివారం హైదరాబాద్​లో కేంద్రమంత్రి జి. కిషన్​రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.రామకృష్ణ శనివారం బీఆర్ఎస్​కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 రామకృష్ణ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ​ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో జహీరాబాద్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్​ విజయానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.