
లక్నో: సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజం ఖాన్పై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే పదవికి ఆయనను అనర్హుడిగా ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లపై 2019లో విద్వేషపూరిత కామెంట్లు చేసిన కేసులో గురువారం ఆజం ఖాన్కు మూడేండ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వంటి ప్రజాప్రతినిధులు క్రిమినల్ కేసులో దోషిగా తేలి, రెండేళ్ల జైలు శిక్ష పడితే తమ పదవిని వెంటనే కోల్పోతారు. ఆజంఖాన్కు మూడేళ్ల శిక్ష పడడంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ స్పీకర్కు ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. ఈసీ సిఫారసుతో ఆజంఖాన్ ను స్పీకర్ అనర్హుడిగా తేల్చి, రాంపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు.