ఫేమస్ అయ్యేందుకే అక్కను చంపిండు .. హత్యకు ముందు ఇన్స్టాలో రీల్

ఫేమస్ అయ్యేందుకే అక్కను చంపిండు .. హత్యకు ముందు ఇన్స్టాలో రీల్
  • చంపి బాగా ఫేమస్​ అవుతానని ప్రకటన

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంబజర్ల గ్రామంలో అక్కను తమ్ముడు హత్య చేసిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన రుచిత(21)ను సోమవారం తమ్ముడు రోహిత్​ హత్య చేసిన విషయం తెలిసిందే. తన సోదరి అదే గ్రామానికి చెందిన ఓ  యువకుడితో తరచూ మాట్లాడుతుండడంతో రోహిత్​ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే పోలీసుల విచారణలో మరో కొత్త విషయం బయటికి వచ్చింది. నిందితుడు రోహిత్​ హత్య ఘటనకు ముందు ఇన్​స్టాలో ఓ రీల్​ చేసినట్లు గుర్తించారు. 

ఆ రీల్​లో ‘బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా’ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పథకం ప్రకారమే యువకుడు తన సోదరిని హతమార్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.