షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్లో వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ప్రారంభించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ బక్కన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మండల ఏవో నిశాంత్ పాల్గొన్నారు.
