Rashmika Mandanna: అరుదైన గౌరవం దక్కించుకున్న రష్మిక.. విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్

Rashmika Mandanna: అరుదైన గౌరవం దక్కించుకున్న రష్మిక.. విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna)కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఆమె వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్ ఇండియా(Forbes India) వెర్షన్ కవర్ పేజీ పై కనిపించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రెజెంట్ ఇండియాలో టాప్ పొజిషన్ కు ఎదుగుతున్న యువ వ్యాపారాలు, ఆవిష్కర్తలు, స్టార్స్ పై ఫోర్బ్స్ ఇండియా స్పెషల్  ఆర్టికల్ ను ప్రచురించింది. ఈ ఆర్టికల్ లో సినీ ఇండస్ట్రీ నుండి రష్మిక మందన్నా స్థానం దక్కించుకున్నారు. ఈ ఆర్టికల్ కవర్ పేజీని తన ఇన్‌స్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు రష్మిక. ఆమెకు దక్కిన ఈ గౌరవానికి నెటిజన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో రష్మిక పేరు ప్రస్తుతం నేషనల్ వైడ్ ట్రేండింగ్ గా మారిపోయింది. 

ఇక ఇదే విషయంపై తాజాగా స్పందించారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేరుకున్నావు. ఇలాగే మరింత ఉన్నత స్థాయికి నువ్వు ఎదగాలని, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను.. అంటూ రాసుకొచ్చారు విజయ్. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని వార్తలు వినిపిస్తున్న వేళా.. విజయ్, రష్మిక గురించి ఈ పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చనియ్యాంశం అయ్యింది. 

ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో రెండో పార్ట్ పై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.   

Also Read: టార్గెట్ హాలీవుడ్.. అంచనాలు డబుల్ చేస్తున్న కల్కి లీక్డ్ వీడియో