
గత కొద్దిరోజులుగా ‘గుడ్ బై’ చిత్రం ప్రమోషన్స్తో బిజీగా ఉంది రష్మిక. నిన్న విడుదలైన ఈ సినిమాలో అమితాబ్కు కూతురిగా ఆమె పోషించిన తార పాత్రకు మంచి అప్లాజ్ వస్తోంది. రష్మికకు ఇది బెస్ట్ బాలీవుడ్ డెబ్యూ అంటున్నారు. ఇటు ప్రమోషన్స్, అటు షూటింగ్స్ మధ్య చిన్న బ్రేక్ దొరకడంతో వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిందామె. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఖాతాలో ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా ఆలియాభట్ మొదలు జాన్వీకపూర్ వరకు చాలామంది పేర్లు వినిపించాయి. రష్మికను ఫైనల్ చేశారనే టాక్ కూడా గత కొన్ని నెలలుగా ప్రచారంలో ఉంది.
తాజాగా ఈ మూవీ విషయంపై స్పందించిందామె. ఎన్టీఆర్తో కలిసి నటించబోయేది నిజమేనా అని అడిగితే.. ‘అప్పుడే ఎలా తెలిసింది.. ఇంకా అఫీషియల్గా కూడా చెప్పలేదు’ అంటూ బదులిచ్చింది. అంతేకాదు ఇందులో నటించడానికి ఎక్సైటింగ్గా ఉన్నానంటూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ‘పుష్ప’ తర్వాత బాలీవుడ్లోనూ తనకు క్రేజ్ పెరగడంతో పాటు అక్కడా వరుస సినిమాలు చేస్తోంది. ఎన్టీఆర్ చేయబోయేది ప్యాన్ ఇండియా మూవీ కనుక రష్మికనే ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందీలో ‘మిషన్ మజ్ను’ షూట్ పూర్తి చేసిన రష్మిక.. ‘యానిమల్’లో నటిస్తోంది. తెలుగులో వారసుడు, పుష్ప 2 చిత్రాలు చేస్తోంది.